గచ్చి బౌలి ఐటీ కారిడార్ లో‌ చిరుత కలకలం

-

కొద్దిరోజులుగా తెలంగాణలో వరుస పులి దాడులు టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకంగా ఒక యువకుడిని ఒక యువతిని కూడా అవి పొట్టన పెట్టుకున్నాయి. రోజూ ఏదో ఒక చోట పులి కి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో కూడా చిరుతపులి హల్ చల్ చేసింది. చాలా రోజుల పాటు దాని కోసం వెతికిన అటవీశాఖ అధికారులు చివరికి దానిని పట్టుకుని అడవిలో వదిలేశారు.

అయితే తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్ లో చిరుతపులి కలకలం రేగింది. గచ్చిబౌలి లేని రోడా మిస్త్రీ కాలేజీలో ఉన్న కుక్క ను చిరుత పులి ఎత్తుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి చిరుత కోసం ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాలేజీ పక్కన ఉన్న గుట్టలలో నుంచి చిరుత వచ్చి వెళ్ళినట్లుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news