కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ పై పోటీ చేస్తా : గద్దర్

-

తెలంగాణ సీఎం కేసీఆర్ పై అటు ప్రజల్లోనూ మరియు రాజకీయ పార్టీలలోనూ మెల్ల మెల్లగా వ్యతిరేకత స్టార్ట్ అవుతోందని తెలుస్తోంది. ఎప్పుడైతే జాతీయ పార్టీని పెట్టారో అప్పటి నుండి BRS కు తెలంగాణాలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాగా తాజాగా తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ సీఎం కేసీఆర్ పై సేన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తాజాగా తెలంగాణాలో హైద్రాబాద్ లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభకు గద్దర్ వెళ్ళాడు. ఈ సభలో మాట్లాడిన గద్దర్ నెల రోజుల్లోనే కొత్త పార్టీ పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఉన్న 4 కోట్ల ప్రజలే నా పార్టీ అని మాట్లాడారు.

అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఏకంగా కేసీఆర్ పైనే పోటీ చేస్తానని ప్రకటించడం అందరికీ షాక్ కు గురి చేస్తోంది. ఈ పార్టీలో లక్షమంది కళాకారులు, రచయితలు, జర్నలిస్టు లు ఉంటారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news