బీజేపీకి షాక్.. కొత్త పార్టీ పెట్టనున్న గాలి జనార్దన్ రెడ్డి !

-

‘మైనింగ్‌ కింగ్‌’ గాలి జనార్థన్‌ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనింగ్‌ లో అక్రమాలు చేసి.. దాదాపు 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు ‘మైనింగ్‌ కింగ్‌’ గాలి జనార్థన్‌ రెడ్డి. ఒకప్పుడు.. కర్ణాటక రాష్ట్రంలో… అన్ని తానై మైనింగ్, రాజకీయాలు నడిపించాడు.

 

ఇక ప్రస్తుతం.. తన వ్యాపారాలను న్యాయంగా నడుపుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ‘మైనింగ్‌ కింగ్‌’ గాలి జనార్థన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిజెపికి చెందిన గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ ప్రారంభించేందుకు జనార్దన్ రెడ్డి సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే ఈసీ ని కలిసి, దీనిపై కార్యాచరణ ప్రకటించనున్నారు జనార్దన్ రెడ్డి. కర్ణాటకలో దాదాపు 20 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగల సత్తా గాలి జనార్దన్ రెడ్డికి ఉంది. దీంతో బీజేపీ పార్టీలో కలవరం మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news