యూపీలో దారుణం… డ్రగ్స్ ఇచ్చి పదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్

-

దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా.. కామాంధులకు బుద్ది రావడం లేదు. నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాల ద్వారా వారిలో భయాన్ని కల్పించలేకపోతున్నామా.. అనే అనుమాానాలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో బాలిక కామాంధుల దాష్టీకానికి బలైంది. ఓ పదో తరగతి బాలికను అపహరించి.. డ్రగ్స్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మార్గులు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లో గురువారం ఈ దారుణం జరిగింది. ట్యూషన్ కు వెళ్లి వస్తున్న పదో తరగతి విద్యార్థినిని అపహరించి.. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు దుండగులు. ముందుగా ఇద్దరు వ్యక్తులు బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి.. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వీరికి మరో ఇద్దరు జతకలిశారు. నలుగురు బాలికకు డ్రగ్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కాగా ట్యూషన్ కు వెళ్లిన బాలిక ఇంటికి రాక పోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా గాలించగా… అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది. తెల్లవారిని తర్వతా మెలుకువలోకి వచ్చిన బాలిక తనపై జరిగిన ఆకృత్యాన్ని పోలీసులకు వెల్లడించింది. నలుగురిపై కేసు నమోదు చేసిన జన్సాథ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news