బీహార్ కంటే ఏపీలో అరాచ‌కాలు ఎక్కువ‌ : బీజేపీ ఎంపీ

-

ఏపీ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 30 నెలల వండర్ ముగిసిందని… బీహార్ కంటే దారుణమైన పాలన ఏపీలో ఉందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీహార్ ని మించిన అరాచకాలు జరుగుతున్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం 30ఏళ్ళు వెనక్కుపోయిందని.. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కారణంగానే కేంద్రాన్ని అడగలేకపోతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో తలాతోక లేని పాలన జరుగుతోందని… వచ్చే 30నెలల్లో భారతీయ జనతాపార్టీ సమర్ధత ఏంటో చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు. హాయగ్రీవ జగదీశ్వరుడు వెనుక నా ప్రమేయం లేదని… జగదీశ్వరుడు ఎవరో నాకు తెలీదని పేర్కొన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నాతో ఈ విషయమై మాట్లాడలేద‌ని.. జగదీశ్వరుడు కి అన్యాయం జరిగిందా లేదా అన్నది ముఖ్యమ‌న్నారు. జగదీశ్వరుడు కే కాదు, సుబ్బారావు గుప్తా లాంటి వైసీపీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారని.. వైసీపీ నేతలు అభద్రతా భావంలో వున్నారని ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి.

 

Read more RELATED
Recommended to you

Latest news