బిగ్ బ్రేకింగ్ : గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌..!

-

కాన్పూర్ గ్యాంగ్‌ స్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్‌ కౌంటర్‌ లో హతమయ్యాడు. మధ్య ప్రదేశ్‌ లోని ఉజ్జయినీలో నిన్న పట్టుబడ్డ వికాస్ దూబేను..ఉత్తర ప్రదేశ్‌ కు తరలిస్తుండగా ఎన్‌ కౌంటర్‌ లో మరణించాడు. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు వికాస్‌ ను యూపీకి తరలిస్తుండగా కాన్వాయ్‌ లోని ఓ కారు బారా వద్ద ఉదయం 7.00 గంటల ప్రాంతంలో బోల్తా పడింది.

దీన్ని అవకాశం తీసుకుని తప్పించుకోవడానికి దూబే ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు.  మృతదేహాన్ని కాన్పూర్‌ దవాఖానకు తరలించారు. దాదాపు 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్ దూబేను.. ఓ హత్య కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై తన అనుచరులతో దాడి చేయించిన ఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news