జైల్లో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌కు నూకలు చెల్లిపోతాయి :మాజీమంత్రి

-

చంద్రబాబు అరెస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తన పతనానికి తానే మరణశాసనం రాసుకున్నాడని విమర్శలు గుప్పించారు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు. ఇవాళ గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో చంద్రబాబుకు ఏదైనా జరిగితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి నూకలు చెల్లిపోతాయని, ఇంటికంటే జైలే భద్రమన్న మంత్రులు, అధికారులు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు గంటా శ్రీనివాసరావు.

Ganta Srinivasa Rao: Is he a strategist or opportunist? | Visakhapatnam  News - Times of India

తాత్కాలిక పైశాచిక ఆనందం పొందుతున్న మంత్రులు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోర ప రాభావం ఖాయం…ఇప్పటి వరకు వున్న అనుమానాలు కూడా తొలగిపోయాయన్నారు. దేశంలో ఏ రాజకీయ నేతకు లేనన్ని ఈడీ,సీబీఐ కేసులు జగన్మోహన్ రెడ్డిపై వున్నాయని, స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు కర్త,కర్మ క్రియ అని అరెస్ట్ చేయడం హేయమైనది…. కేబినెట్ సమిష్టిబాధ్యత అయితే చంద్రబాబు ఒక్కరినే ఎలా బాధ్యుల్ని చేస్తారన్నారు గంటా శ్రీనివాసరావు. సీమెన్స్ సంస్ధకు ఇవ్వడమే తప్పు అయితే బైజ్యూస్, అమూల్ డైరీల సంగతేంటి..? అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. అయితే.. చంద్రబాబు విడుదల కోసం సంపత్ వినాయగర్ గుడిలో గంటా శ్రీనివాసరావు 101 కొబ్బరికాయలు కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news