కన్నీటి పర్యంతమైన గెల్లు శ్రీనివాస్ .. వీడియో వైరల్

-

హుజూరాబాద్ లో టీఆర్ఎప్ ఓటమిని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేపోతున్నారు. ముఖ్య నాయకులు బీజేపీ విజయాన్ని ఎంత చిన్నదిగా చూపాలని ప్రయత్నిస్తున్నా… సగటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన నాయకులంతా టీఆర్ఎస్ పార్టీ వారే అయినప్పటికీ గెల్లు శ్రీనివాస్ ను గెలిపించలేకపోయారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ మంత్రుల, ఎమ్మెల్యేలు, స్థానికి కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఎంతగా ప్రచారం చేసిన బీజేపీ, ఈటెల జోరు ముందు నిలువలేక పోయారు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి 23 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఓటమి పాలవుతున్నానని తెలిసి గెల్లు శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. గెల్లు శ్రీనివాస్ కార్యకర్తల సమక్షంలో కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పుడు ఆ వీడియో తెలంగాణ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్బుక్ లలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకి కొంతమంది రకరకాల పాటలను జోడిస్తూ.. తమ క్రియేటివిటీనీ చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news