గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. వారికి కేటీఆర్ వరాలు..!

-

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అదే సమయంలో ఈ జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన టిఆర్ఎస్ పార్టీ.. ప్రస్తుతం పార్టీ లోని ముఖ్య నేతలందరినీ రంగంలోకి దింపి ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.

ఎన్నికలు డిసెంబరు ఒకటో తేదీ న జరగబోతున్న నేపథ్యంలో ప్రచారానికి కొంత సమయం మాత్రమే మిగిలి ఉన్న క్రమంలో అన్ని కుల సంఘాలు సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన కుల సంఘాల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులకు వరాలు కురిపించారు కేసీఆర్. జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపిస్తే ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా టిఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్ అదేసమయంలో ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news