కర్ణాటకలో దారుణం…. బాలికపై 8 మంది అత్యాచారం

-

దేశంలో అత్యాచాారాలను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా… అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఒంటరిగా అమ్మాయి, మహిళ కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దగ్గరగా ఉండే వారే అఘాయిత్యాలకు తెగబడుతుండటం కలవరపరుస్తోంది. వావీవరసలు మరిచి మృగాళ్లు అత్యాచారాలకు తెగబడుతున్నారు. 

తాజాగా కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. యలహంక ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాలికను బెదిరించారు. ఓ రోజు బాలిక ఇంటికి ఏడ్చుకుంటూ రావడాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఆరా తీయగా కబాబ్ కారంగా ఉండటంతో ఏడ్చానని తెలిపింది బాలిక. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా….మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news