కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంక గాంధీ కి ఇవ్వండి: ప్రశాంత్ కిషోర్

-

గత రెండు వారాలుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది.అయితే అన్ని ఊహాగానాలకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ఆయన ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త గా మాత్రమే పని చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.వాస్తవానికి పార్టీలో ఒక కీలకమైన హోదాను ప్రశాంత్ కిషోర్ ఆశించారు.అయితే పార్టీ వ్యూహలను రూపొందించే సాధికారిక బృందం లో సభ్యుడిగా మాత్రమే ఉండాలని అధిష్టానం ప్రతిపాదించడంతో..ఆయన పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కు తన కంటే ఎక్కువగా సంస్థాగత సమస్యలను గుర్తించే నాయకత్వం అవసరమని ఆయన అన్నారు.కాగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ప్రియాంక గాంధీ కి ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news