బ్రేకింగ్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం

-

రెండు రోజులుగా దిగొస్తున్న బంగారం ధ‌ర ఈ రోజు భారీగా పెరిగింది. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయలు పెరిగింది. దీంతో 39,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 310 రూపాయల పెరుగుదల తో 36,220 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధరలో మార్పు లేదు. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,700 వద్ద నిలింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగి 38,200 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగి 37,000 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి 46,700 రూపాయల వద్ద నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news