బ్రేకింగ్‌: భారీగా పెరిగిన‌ బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న స్వ‌ల్పంగా త‌గ్గ‌న బంగారం ధ‌ర ఈ రోజు అమాంతం పైకెగ‌సింది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 420 రూపాయలు పెరిగి 39,940 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 420రూపాయలు పెరిగి 36,650 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఈరోజు భారీగా భగ్గుమన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర ఏకంగా 600 రూపాయలు పెరిగి 47,500 వద్దకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 400 రూపాయలు పెరిగింది. దీంతో 38,600 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయలు పెరగడంతో 37,400 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 600 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 46,900 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news