మహిళలకు బిగ్ షాక్.. 50 వేలు దాటిన బంగారం ధరలు

-

బంగారం.. ప్రపంచంలోన అత్యంత విలువైన వస్తువు. దీనిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఎగబడతారు. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. మీద రూపాయలలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 కు పెరిగి.. రూ. 50,100 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి.. రూ. 45, 900 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా కాస్త పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ రూ. 300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 68,500 కు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news