మెగా అభిమానులకు శుభవార్త.. తల్లిదండ్రులుగా ఉపాసన రాంచరణ్..

-

మెగా అభిమానులకు శుభవార్త అందింది.. ఇప్పటికే ఎన్నో ఏళ్ళు గా ఎదురుచూస్తున్న ఒక విషయానికి తాజాగా క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నారని విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు..

రామ్ చరణ్ ఉపాసన దంపతులు 2012 జూన్ 14న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. ఇరు కుటుంబాల సమక్షంలో వీరు పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన దగ్గరనుంచి చిరంజీవికి, అతని కుటుంబానికి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎప్పుడు శుభవార్త చెప్తారు అంటూ ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు వీరు స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరూ తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నారని విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలుపుతూ తన ఆనందాన్ని ప్రకటించారు..

“హనుమాన్ జి ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డలను ఆహ్వానిస్తున్నారు. చిరంజీవి సురేఖ, శోభన అనిల్ కామినేని.” అని పేర్కొన్నారు.. అయితే పెళ్లి అయిన దగ్గర్నుంచి ఎంతో అన్యోన్య జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులిద్దరూ పిల్లల కోసం ఎదురైనా ప్రశ్నలను పెద్దగా పట్టించుకోలేదు. తమకు తమ జీవితం వ్యక్తిగత ఆనందం ముఖ్యమని.. అలాగే ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని ఆలోచనలు, సమస్యలు ఉంటాయని, వాటిని ఎదుర్కొని ముందుకు వెళుతూనే ఉంటామని ఎప్పటికప్పుడు చెప్పకు వచ్చారు ఉపాసన. అయితే తాజాగా ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో ఆనందం నెలకొంది..

Read more RELATED
Recommended to you

Latest news