ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..జీతాల్లో మార్పులు..వీకాఫ్..

-

ఉద్యోగులకు సంభంధించిన అన్నీ కొత్త చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది..ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు కీలక అంశాలను విడుదల చేసింది.జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది..కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు, పీఎఫ్‌తో పాటు పనిగంటలు సహా ఇతర అంశాల్లో మార్పులు రానున్నాయి. పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి నాలుగు కొత్త కార్మిక చట్టాలను తెస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం వెల్లడించింది.

వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు తదితర అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు ఈ చట్టాల ద్వారా సాధించాలని భావిస్తోంది. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే, అధికారిక పనిగంటలు పెరుగుతాయి. ఇప్పుడున్న 8-9 గంటలకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఓటీ సమయం 50 నుంచి 150 గంటలకు పెరుగుతుంది. పీఎఫ్‌లో కార్మికుడు, యజమాని జమచేసే వాటా కూడా పెరుగుతుంది. గ్రాస్ వేతనంలో 50 శాతం బేసిక్‌ ఉండాలి..పీఎఫ్‌కి కార్మికుడు జమచేసే మొత్తం పెరుగుతుంది.ఆ సంస్థ యజమాని కూడా అంతే జమ చెయ్యాలి..రిటర్మెంట్ తర్వాత అందుకునే మొత్తం, గ్రాట్యుటీ పెరుగుతాయి.

ఇలా చెయ్యడం పదవీవిరమణ తర్వాత ఉద్యోగులకు ఇబ్బందిలేకుండా జీవించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే చాలా ప్రైవేట్‌ కంపెనీలు వారానికి రెండు రోజుల వీకాఫ్‌ను అమలు చేస్తున్నాయి. కానీ, కొన్ని సంస్థలు అమలు చేయట్లేదు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే, అన్ని కంపెనీలు కార్మికులకు వారానికి రెండు, నుంచి మూడు రోజులు వీకాఫ్‌ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వేతన కోడ్ ప్రకారం.. వారానికి 48 గంటలు ఉద్యోగి పని చేయాల్సి ఉంటుంది.. ఏ సమయాలు అనేది పూర్తిగా ఆయా కంపెనీల నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news