తెలంగాణ పోలీస్ కానిస్టేబుళ్లకు శుభవార్త.. త్వరలోనే ప్రమోషన్లు

-

తెలంగాణ రాష్ట్రంలోని కానిస్టేబుళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. త్వరలోనే 3500 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించనుంది. ఈ నేపథ్యంలోనే యూనిట్ల వారీగా కానిస్టేబుళ్ల సీనియారిటీ జాబితాలను పోలీస్‌ ఉన్నతాధికారులు రూపొందిస్తున్నారు. కానిస్టేబుల్‌ పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు మరో వారంలో రోజుల్లో వెలువడనున్నట్లు సమాచారం అందుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా కానిస్టేబుళ్ల పదోన్నతులు పెండింగ్‌ లో ఉన్నాయి. పోలీస్‌ కానిస్టేబుల్‌ గా ఉద్యోగంలో చేరి ఏళ్లు గడుస్తున్నా కనీసం హెడ్‌ కానిస్టేబుళ్ గా అయినా పదోన్నతి లభించలేదని గతంలో ఓ బ్యాచ్‌ కానిస్టేబుళ్లు నిరసనలు వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఉద్యోగికి తమ సర్వీసు కాలంలో కనీసం మూడు పదోన్నతులు కల్పించాల్సి ఉండగా.. తమకు మాత్రం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లపై దృష్టి పెట్టింది. త్వరలోనే ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news