ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి గుడ్ న్యూస్..

-

ఏపీ లోని గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభ వార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్ కు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జానీ పాషా తెలిపారు. సీఎం జగన్ జనవరి 7వ తేదీన చేసిన ప్రకటన ప్రకారం సచివాలయ ఉద్యోగుల ప్రొఫెషన్ జూన్ 30వ తేదీ లోపు డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాo అని ప్రకటన చేశారు.

AP-Village-Secretariat
AP-Village-Secretariat-

కొత్త పి ఆర్ సి ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన మాట ప్రకారం… ప్రొఫెషన్ డిక్లరేషన్ టు సచివాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మోహన్ పేరుతో సోమవారం సచివాలయ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయేలా సువర్ణ అధ్యాయానికి… నాంది పలికారని గుర్తుచేశారు. లక్ష 34 వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కేవలం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news