నిరుద్యోగులకు శుభవార్త.. కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్న మంత్రి సబితా

-

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీపై మంత్రి మాట్లాడారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అసెంబ్లీలో తెలిపారు.

విద్యారంగం పద్దు పై చర్చలో మాట్లాడిన ఆమె.. మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని, సిలబస్ మార్పులకు పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పదివేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే భాషా పండితులు, ఇతర సమస్యలు కొన్ని కోర్టులో ఉండడంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని వివరించారు. అలాగే ఇంగ్లీష్ మీడియం లో బోధన కోసం 80 వేల మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news