బీటెక్ చేసినవారికి గుడ్ న్యూస్..బెల్ లో జాబ్స్..ఇలా అప్లై చేసుకోండి..

-

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది…
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనుంది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 19న ప్రారంభమైంది. దరఖాస్తుకు వచ్చే నెల 3ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ bel-india.inలో ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ట్రీని ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు..

పూర్తి వివరాలు:

బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు AICTE గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఈ డిగ్రీ పొంది ఉండాలి. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇతర అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. ఎంపికైన అభ్యర్థులు సంస్థకు చెందిన బెంగళూరు కాంప్లెక్స్ లో పని చేయాల్సి ఉంటుంది.
వయస్సు: వయస్సు ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

*. అభ్యర్థులు మొదటగా బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ www.bel-india.inను ఓపెన్ చేయాలి.

*.  హోం పేజీలో Career ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
*.  తర్వాత నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
*. కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
*. దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి..
ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news