టెన్త్, ఇంటర్‌ పూర్తి చేసినవాళ్ళకి గుడ్ న్యూస్… రైల్వేలో ఖాళీలు…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ లోని ఉత్తర రైల్వే లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే…

2022-23 సంవత్సరానికి సంబంధించి స్కౌట్స్, గైడ్స్ కోటా లో గ్రూప్ సి, డి పోస్టులకి అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. సివిల్ ఇంజినీరింగ్, ఎస్‌ అండ్‌ టీ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లో ఖాళీలు వున్నాయి. ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అన్నది చూస్తే… టెన్త్, ఇంటర్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ప్యాస్ అయిన వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. . 2022-23 సంవత్సరానికి సంబంధించి స్కౌట్స్, గైడ్స్ కోటా లో గ్రూప్ సి, డి పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 28, 2023. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తుంటారు. పూర్తి వివరాలను మీరు http://www.rrcnr.org/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news