పర్యాటక ప్రేమికులకు గుడ్ న్యూస్…ఈనెల 15 నుండి నల్లమల సఫారీ…!

-

పర్యాటక ప్రేమికులకు శుభవార్త. ఈ నెల 15 నుండి నల్లమల లో అటవీశాఖ సఫారీ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించింది. సఫారీ కి వెళ్లాలని అనుకునేవారు ఆన్లైన్ లో డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక పేరు నమోదు చేసుకున్న వారిని మొదటిరోజు మన్ననూరు అడవి నుండి ఉమామహేశ్వరం వరకు ట్రెక్కింగ్ తీసుకువెళ్తారు. అంతే కాకుండా సాయంత్రం ప్రత్యేక వాహనంలో మన్ననూరు తీసుకువచ్చి రాత్రి భోజనం మరియు బస ఏర్పాటు చేస్తారు.

అంతే కాకుండా మరుసటి రోజు ఉదయం సఫారీ లో భాగంగా ఫర్హాబాద్ తీసుకువెళ్లనున్నారు. ఆ తర్వాత ల్యాబ్ మరియు షార్ట్ ఫిల్మ్ లు కీటకాల ప్రదర్శన లాంటివి ఉండనున్నాయి. ఇక నల్లమల అటవీ ప్రాంతాన్ని చూడాలని చాలామంది పర్యాటక ప్రేమికులు ఇష్టపడుతుంటారు. ఇక్కడ ఇటీవల పలు సినిమా షూటింగ్ లను సైతం చిత్రించారు. ఇప్పుడు అటవీ శాఖ తీసుకున్న నిర్ణయంతో పర్యాటక రంగానికి సైతం మేలు చేకూరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news