ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..సిలబస్ తగ్గింపు..!

-

కరోనా కారణంగా గతేడాది ఇంటర్ విద్యార్థులకు సిలబస్ ను 30 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా సిలబస్ ను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రం లో ఈ విద్యాసంవత్సరం 2021-22 కూడా ఇంటర్ సిలబస్ 70 శాతమే ఉండనుంది. ఈ మేరకు సిలబస్ ను తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది.

రాష్ట్రాలు కూడా కేంద్రం ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా విడుదల విడుదల చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. కాబట్టి సిలబస్ మొత్తం పరీక్షల్లో ఇస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయం తో విద్యార్థులపై కూడా భారం తగ్గనుంది.

Read more RELATED
Recommended to you

Latest news