హైదరాబాద్ లో ఆస్తిపన్ను బకాయిల విషయంలో గుడ్ న్యూస్…!

-

హైదరాబాద్ లో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను బకాయిలు చెల్లింపుకు ప్రకటించిన వన్ టైమ్ స్కీమ్ గడువును పెంచామని జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తి పన్ను బకాయిపై వడ్డీ మాఫీ పొందుటకు ఇదే చివరి అవకాశం అని కమీషనర్ పేర్కొన్నారు.

ఈ వెసులుబాటు తేది 15-11-2020 వరకు మాత్రమే అని కమీషనర్ వెల్లడించారు. 2019-20 వరకున్న ఆస్తిపన్ను బకాయిలు కేవలం 10% వడ్డీతో చెల్లించoడి అని కమీషనర్ సూచించారు. ఆస్తిపన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ పొందమని కమీషనర్ పేర్కొన్నారు. దీనితో ఆన్లైన్ లో మంచి స్పందన వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news