హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు అనుమతి..!

-

తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.19,579 కోట్లుగా నిర్ణయించింది. కారిడార్ 9లో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు కొనసాగించనున్నారు. కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలో మీటర్లు ఉంటుంది.

hyd metro
hyd metro

కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు కొనసాగించనున్నారు. మొత్తం 86.1 కిలోమీటర్ల వరకు మెట్రో ప్రాజెక్టు నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. పరిపాలనా అనుమతిని డీపీఆర్ కు జత చేసి కేంద్రానికి పంపనున్న తెలంగాణ ప్రభుత్వం…
పాతబస్తీ మెట్రో అనుసంధానానికి రూ.125 కోట్లు విడుదల చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news