రాజ్ భవన్ లో ఘనంగా దీపావళి సంబరాలు

-

రాజ్ భవన్ దర్బార్ హాల్ లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పలువురు ప్రముఖులు, ప్రజలు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచిక ఈ పండుగ అని తెలిపారు.

గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని తెలిపారు తమిళిసై. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనే ఉంటుందన్నారు. గవర్నర్ గా తనకు ఉన్న పరిధికి లోబడే నడుచుకుంటానని పునరుద్ఘాటించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.. గవర్నర్ గా తన బాధ్యతను ఎరిగి నిర్ణయాలు వెలువరిస్తానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news