భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ ని తరిమేయాలి: పవన్ కళ్యాణ్

-

దేశవ్యాప్తంగా మరో రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది .భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పార్టీ లో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘భీమవరాన్ని నేను వదలను. అక్కడ రౌడీయిజం పోవాలి అని,గ్రంధి శ్రీనివాస్ను తరిమేయాలి అని పిలుపునిచ్చారు.అక్కడివారంతా ఒక రౌడీకి భయపడాల్సి వస్తోంది అని అన్నారు. నేను కూడా గ్రంధి శ్రీనివాస్ బాధితుడినే. నాకు స్థలం ఇవ్వడానికి కూడా అందరూ భయపడుతున్నారు అని అన్నారు. ఆంజనేయుల్ని ఒకటే కోరుతున్నా. నేనెప్పుడన్నా వచ్చి ఉండటానికి చిన్న స్థలం చూపించండి. నా డబ్బులతో నేను కొనుక్కుంటా’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news