బిజినెస్ ఐడియా: బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? ఇది మీ కోసమే..

-

ఈ మధ్య బిజినెస్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.అందరూ చేసేది కాకుండా కొత్తగా ఏదైనా చేయాలని అనుకోనేవారికి చక్కటి బిజినెస్ ఐడియా..మొబైల్-ల్యాప్‌టాప్ రిపేర్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించండి. ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు నేడు నిత్యావసర వస్తువులుగా మారిన విషయం తెలిసిందే. ఇంటర్నెట్‌ను సులభంగా యాక్సెస్ చేయగలుగుతుండడంతో భారతదేశంలో ఆన్‌లైన్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు ఆఫీసులో కనిపించే ల్యాప్‌టాప్ ఇప్పుడు ప్రతి ఇంటికి అవసరంగా మారడానికి కారణం ఇదే. ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ల ట్రెండ్‌ పెరిగిపోవడంతో వాటిని రిపేర్‌ చేసే వారికి కూడా డిమాండ్‌ పెరుగుతోంది..

ఈ బిజినెస్ కన్నా ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ల్యాప్‌టాప్ మరియు మొబైల్ రిపేరింగ్‌లో కోర్సు చేయడం ముఖ్యం. దేశంలోని అనేక ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అంతే కాకుండా ల్యాప్‌టాప్, మొబైల్ రిపేరింగ్ ను ఆన్‌లైన్‌లో నేర్చుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లడం మంచిది. కోర్స్ చేసిన తర్వాత రిపేరింగ్ సెంటర్‌లో కొంత సమయం పని చేస్తే ఇంకా మంచిది.

ల్యాప్‌టాప్ రిపేరింగ్ కేంద్రాలను ప్రజలు సులభంగా చేరుకోగలిగే ప్రదేశంలో తెరవాలి. మరియు ఇప్పటికే ఎక్కువ కంప్యూటర్ రిపేరింగ్ కేంద్రాలు ఉండకూడదు. మీ కేంద్రాన్ని ప్రచారం చేయడానికి మీరు సోషల్ మీడియా సహాయం తీసుకోవచ్చు. మీరు వారి చుట్టూ మరమ్మతు కేంద్రాన్ని తెరిచారని ఎక్కువ మంది ప్రజలు తెలుసుకుంటారు. ఇది మీ కస్టమర్లను పెంచుతుంది. ఇకపోతే అవసరమైన పరికరాలను మీ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆ జాబితా తయారు చేసుకుని కొనుగోలు చేయాలి. రిపేర్ చేసే సమయంలో మార్చాల్సిన పరికరాలను ఉదాహరణకు స్పీకర్లు, స్క్రీన్ లాంటి వాటిని ఆర్డర్ ఇచ్చి అప్పటికప్పుడు తెప్పించుకోవచ్చు.

ఈ బిజినెస్ ను మొదలు పెట్టాడానికి రూ.. 2 నుండి 4 లక్షలతో ప్రారంభించవచ్చు. ప్రారంభంలో, చిన్న వస్తువులను ఉంచడం ద్వారా పని చేయవచ్చు. పని పెరిగే కొద్దీ పెట్టుబడి కూడా పెరగవచ్చు. మరమ్మతు చేయడమే కాకుండా, తర్వాత మీరు ల్యాప్‌టాప్‌లు మరియు మొబైల్‌లను విక్రయించడం కూడా ప్రారంభించవచ్చు. మొబైల్ మరియు ల్యాప్‌టాప్ రిపేరింగ్ ఫీజు చాలా ఎక్కువ..బాగా ఆదాయాన్ని పొందవచ్చు..బిజినెస్ మంచిగా క్లిక్ అయితే.. మీ ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news