హైదరాబాద్ లో విషాదం..వివాహమైన 24 గంటలకే వరుడు మృతి, కోమాలోకి వధువు

-

దేశంలో రోజు రోజు కు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిమయ నిబంధనాలు చేపట్టినప్పటికీ…. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే… తాజాగా పెళ్లింట విషాదం నింపింది రోడ్డు ప్రమాదం. పెళ్లి జరిగిన 24 గంటలు గడువక ముందే… నూతన వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ లోని శేరి లింగం పల్లి లో చోటు చేసుకుంది. వివాహమైన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు పెళ్ళి కుమారుడు.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్ళింది పెళ్లి కూతురు. అటు పెళ్లి కొడుకు ఇవాళ మృతి చెందాడు. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.   తిరుపతిలో వివాహం చేసుకొని చెన్నైలో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ నూతన వరుడి మృత దేహానికి పంచనామా నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news