లోకేష్ స్థాయి ఏమిటి, లోకేష్ బ్రతుకు ఏమిటి : గుడివాడ అమర్నాథ్‌

-

సీఎం జగన్ కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ కు లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ స్థాయి ఏమిటి, లోకేష్ బ్రతుకు ఏమిటని ఆయన ప్రశ్నించారు. చర్చకు రమ్మని ఈడి, సిఐడి ఇన్కమ్ టాక్స్ చర్చకు రమ్మని పిలుస్తున్నాయన్నారు. వాటికి ముందు సమాధానం చెప్పు అంటూ లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు అమర్నాథ్‌. 118 కోట్లుకు సంబంధించి ఇన్కమటాక్స్ పిలిస్తే తప్పించుకొని తిరుగుతున్నారని, పంది కొక్కుకులు తిన్నట్లు 371 కోట్లు ప్రజా దనం తినేసి మాట్లాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. వొళ్ళు బలసి లోకేష్ మాట్లాడుతున్నాడని, నెక్స్ట్ లోకేష్ నే జైల్ కు వెళ్ళేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Oppn finds investors' support hard to digest: AP Minister

అంతేకాకుండా.. ‘దేశంలో 4 వ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు. రెండు ఎకరాల నుంచి 680 కోట్లు ఎలా సంపాదించారు.? పవన్ కళ్యాణ్ నకిలీ కాపు. పవన్ చెపితే కాపులు ఎందుకు టిడిపికి ఓటు వేస్తారు. కాపులకు చంద్రబాబు చేసింది ఏమిటో చెప్పాలి. ముద్రగడ పద్మనాభం కుటంబంను చంద్రబాబు వేదిస్తే ఎందుకు పవన్ మాట్లడలేదు. చిరంజీవిని రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేస్తే ఎందుకు పవన్ ఖండించలేదు. కాపు ప్రముఖులు సమావేశమైతే ఎందుకు పవన్ వెళ్ళలేదు. చంద్రబాబుకు జనసేనను తాకట్టు పెడితే కాపులు ఎందుకు టిడిపికి ఓట్లు వేస్తారు. పవన్ సినిమాల్లో యాక్టింగ్, రాజకీయ ల్లో ఓవర్ యాక్టింగ్. మీ పార్టీ విలీనం చేసి ఒక జెండా పెట్టుకోవచ్చు కదా. జన సైనికులు జెండా కూలీలు. ఒక దొంగని కాపాడటానికి తోడు దొంగలు. అసెంబ్లీ లో చర్చకు సిద్దం. రమ్మనండి.’ అని గుడివాడ అమర్నాథ్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news