గుంటూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు

-

గుంటూరులో ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి అవమానం జరిగింది. బాలు విగ్రహాన్ని అభిమానులు గుంటూరులో ఏర్పాటు చేయగా, అనుమతులు లేవంటూ నగరపాలక సంస్థ మరునాడే తొలగించింది.

జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి తెలియజేసి, ఆదివారం రాత్రి మిత్రుల సహకారంతో విగ్రహాన్ని లక్ష్మీపురం సెంటర్‌లోని మదర్‌ థెరెస్సా కూడలికి చేర్చామని కళాదర్బార్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు చెప్పారు. సోమవారం ఉదయం వెళ్లిచూడగా అక్కడి నుంచి తొలగించి, నగరపాలిక వాటర్‌ ట్యాంకర్ల ప్రాంగణంలో పడేశారని వాపోయారు.

‘విగ్రహం తొలగించవద్దంటూ అక్కడున్నవారు ప్రాధేయపడినా అధికారులు విన్లేదు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీగా ఉండే డివైడర్లు, కూడళ్లల్లో నేతల విగ్రహాలను కొనసాగిస్తూ, బాలు విగ్రహాన్ని తొలగించడమేంటి? రాకపోకలకు అడ్డుగా లేనిచోటే పెట్టాం. ఇంకా ముసుగు తొలగించలేదు. అనుమతి కోసం మేం రెండేళ్లుగా తిరుగుతున్నా, అధికారులు స్పందించలేదు’ అని రంగారావు పేర్కొన్నారు.

‘కోర్టుల ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, రహదారుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. బాలు విగ్రహం పెట్టిన ప్రదేశం నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. దానికి అనుమతి లేనందునే తొలగించామ’ని  కార్పొరేషన్‌ ప్రణాళికాధికారి జీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news