గుంటూరులో పిల్లల కిడ్నాప్ ముఠా కలకలం.. బుర్ఖాలలో వచ్చి !

-

గుంటూరు నగరంలో  పిల్లల కిడ్నాప్ ముఠా కలకలం రేపుతోంది. గుజ్జనగుండ్లలో ఓ బాలుడుని బుర్ఖాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు  పిలిచారు. అయితే వారి వద్దకు వెళ్లకుండా ఇంటికి పరిగెత్తి తప్పించుకున్నాడు బాలుడు. కొద్ది సేపటికి ఉద్యోగ నగర్ ఆర్చీ వద్దకు వచ్చారు దుండగులు. ఈ సమయంలో ఆర్చీ వద్ద మగ వ్యక్తి బురఖా తీస్తుండగా చూసిన మున్సిపల్ కార్మికులు అనుమానం వచ్చి ఇద్దరినీ పట్టుకున్నారు.

అనంతరం వాళ్ళ వద్ద ఉన్న వస్తువులు ఏమిటా అని చూస్తే వారి సంచిలో కత్తులు, తాళ్లు, గ్లౌజ్ లు లభ్యం అయ్యాయి. దీంతో భయ పడి పోలీసులకు కార్మికులు  సమాచారం ఇచ్చారు. అయితే పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు మాచర్ల కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు బ్యాగ్ లో లబించిన వస్తువులు, బురాఖా ఎందుకు వేసుకుని ఉన్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news