బ్రేకింగ్ : మోడీకి కేసీఆర్ లేఖ

-

ప్రధాని మోడీకి తెలంగాణా సీఎం కేసీఆర్ లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టా(పార్లమెంట్ కొత్త భవనం)కు రేపు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా మోడికి లేఖ ద్వారా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఉదయం లేఖను పీఎంఓకు పంపింది తెలంగాణా సిఎంఓ. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సిఎం మోడీని ప్రశంసించారు.

దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉందని సిఎం లేఖలో అభిప్రాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలి’’ అని ముఖ్యమంత్రి లేఖలో కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news