గవర్నర్ కూడా విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యం – గుత్తా సుఖేందర్ రెడ్డి

-

హైదరాబాద్ సంస్థానం భారతదేశం లో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరం లోకి అడుగు పెడుతున్నందున అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆనాడు పోరాటం లో అసువులు బాసిన వారికి జోహార్లు తెలియజేశారు. బాధ్యత లేకుండా కొంత మంది విలీనం, విమోచనం అంటూ, ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమన్నారు.

రాష్ట్ర గవర్నర్ కూడా విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం దౌర్బాగ్యం అన్నారు గుత్తా. ఆమె పని చేసిన తన పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తుందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ కి వుండే గౌరవం పోగొట్టొద్దని అన్నారు. కేంద్రం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టడం సరికాదన్నారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థ కి విఘాతం కలిగిస్తున్నదని ఆరోపించారు. కేంద్రం రాష్ట్ర ల హక్కులను హరిస్తున్నదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news