H3N2 వైరస్‌ కిడ్నీలపై ప్రభావం చూపుతుందట.. జాగ్రత్తలు తప్పనిసరి

-

దేశంలో ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్‌ కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో వైరస్‌ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.. ఇప్పుడు తెలిసిన ఒక విషయం ఏంటంటే.. ఈ వైరస్‌ కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందట.. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోవిడ్-19 తరువాత హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఇన్‌ఫ్లుయెంజా వల్ల ఇద్దరు చనిపోయారు. ఇది తేలికపాటి వ్యాధి అని గుర్తించినా, అనారోగ్యంగా ఉన్న వారికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుంది. హెచ్‌3ఎన్‌2 ఇతర ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులతో పోలిస్తే ఎక్కువ తీవ్రత కలిగిన ఇన్‌ఫ్లుయెంజా. ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి ఆగిపోతుంది.

ఈ వైరస్ శిశువులు, చిన్నారుల్లో పెరిగిపోతోంది. చాలా కేసుల్లో ఐసీయూ చికిత్స కూడా కావాల్సి వస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు, జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు నివేదికలు అందుతున్నాయి.

కిడ్నీలపై ప్రభావం చూపుతుందా..?

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కిడ్నీలపై పెను ప్రభావం చూపుతుంది.. ముఖ్యంగా వృద్దుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాలైన డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ‘ఫ్లూ వైరస్‌గా పేరున్న ఇన్‌ఫ్లుయెంజా కిడ్నీలపై విభిన్న దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఇన్‌ఫ్లుయెంజా వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన వారిలో కిడ్నీ ఫెయిలయ్యే ముప్పు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.. 30 శాతం కేసుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారం ఉంది.

వయస్సు పైబడిన పేషెంట్లలో, ముఖ్యంగా దీర్ఘకాలికంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కార్డియాక్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు కలిగి ఉన్న వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. కిడ్నీ మార్పిడి పేషెంట్లు, డయాలిసిస్ చేయించుకుంటున్న పేషెంట్లలో ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీరిలో సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా, విభిన్న అవయవాల్లో సంక్లిష్టతలు చోటు చేసుకుంటాయి. గుండె కూడా పనిచేయకుండా పోవచ్చు. సాధారణ ప్రజల కంటే వీరు ఎక్కువగా మరణాల బారిన పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news