పరీక్షలు రద్దు చేయకపోతే.. హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష :ఆర్ఎస్‌ ప్రవీణ్‌

-

ఆర్ఎస్ ప్రవీణ్ 48 గంటల్లో టిఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష ఆపకపోతే, హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని ప్రభుత్వానికి హెచ్చరింపులు చేపట్టారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్. ఎంతో మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్థులు అమ్ముకొని వాళ్ల పిల్లల్ని చదివిస్తుంటే టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరు చాలా అసహ్యకరమని తన ఆగ్రహం వ్యక్తపరిచారు ప్రవీణ్ కుమార్.

గతంలో తాను కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పని చేశానని తెలిపారు. చైర్మన్ కు తప్ప మరెవరికి తెలియని పాస్వర్డ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల వద్దకు ఎలా వెళ్ళిందో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు. కారుణ్య నియామాకాల్లో అపాయింట్ అయిన ప్రవీణ్ అనే వ్యక్తి.. తన ప్రియురాలి కోసం కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ తీసుకున్నారంటే శోచనీయమని తెలిపారు. సివిల్స్ ఎగ్జామ్స్ కోసం రాత్రింబవళ్లు చదివినా ప్రిలిమినరీ ఎగ్జామ్ సాధించడం చాలా కష్టం. కానీ, ప్రవీణ్ మాత్రం గ్రూప్ 1 పరీక్షల్లో 150 మార్కులకు 103 మార్కులు ఎలా సాధించాడో చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపారు ప్రవీణ్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Latest news