‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్ర లక్ష్యం అదే : రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్ర ప్రారంభించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  పేద ప్రజల పక్షాన నిలబడి భారత్​ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తెలిపిన సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి గడపకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామనీ తెలిపారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్‌ మండలం మదనపల్లి నుంచి ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రను రేవంత్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్ర కరపత్రాలు విడుదల చేశారు.

ఫిబ్రవరి 6 నుంచి 2 నెలలపాటు ఈ యాత్ర కొనసాగుతుందని రేవంత్​రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news