విషాదం : క‌న్న బిడ్డ‌ల‌కు ఉరి వేసి.. త‌ల్లి ఆత్మ‌హ‌త్య

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఒక త‌ల్లి త‌న ఇద్ద‌రు క‌న్న బిడ్డ‌ల‌కు ఉరి వేసి చంపి.. తానూ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ విషాదక‌ర ఘ‌ట‌న ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీ‌కాకులం జిల్లాలో గ‌ల ద‌మ్మల వీధి లో చోటు చేసుకుంది. ధ‌న లక్ష్మి (35) అనే మ‌హిళ‌కు సోనియా (11), య‌శ్వంత్ (9) అనే పిల్లలు ఉన్నారు. కాగ ఆది వారం ధ‌న లక్ష్మి త‌న పిల్లలు సోనియా, య‌శ్వంత్ కు ఉరి వేసి చంపింది. అనంత‌రం ధ‌న లక్ష్మి కూడా ఆత్మ హ‌త్య చేసుకుని మ‌ర‌ణించింది.

ఈ ఘ‌ట‌న శ్రీ కాకులం జిల్లాలో క‌లక‌లం రేపింది. ధ‌న లక్ష్మి నివాసం ఉంటున్న ఇంట్లోనే ఈ ఆఘ‌త్యానికి పాల్ప‌డింది. ధ‌న లక్ష్మి, సోనియా, య‌శ్వంత్ ల‌ను స్థానికులు పిలిచినా.. లాభం లేక పోవ‌డంతో స్థానికులు పోలీసుకు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృత దేహాల‌ను ఇంట్లో నుంచి తీసి.. పోస్టు మార్టం కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అలాగే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని.. ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. కాగ ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు గ‌ల కారణ‌లు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news