ఖమ్మం సభ బీఆర్ఎస్‌కు చాలా కీలకం : మంత్రి హరీశ్ రావు

-

ఖమ్మం సభ బీఆర్​ఎస్​కు చాలా ముఖ్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. జాతీయ నాయకులు ఈ సభకు వస్తున్నందున.. విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతున్న తరుణంలో జరుగుతున్న చారిత్రక సభకు ఎనలేని ప్రాధాన్యం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.

ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పే దశగా నిలువబోతోందని హరీశ్‌రావు అన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు సన్నాహంగా కూసుమంచిలో శుక్రవారం పాలేరు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు పాల్గొని మాట్లాడారు.

“దేశంలో తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతోంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది. ఖమ్మం సభకు పాలేరు నుంచి 50 వేల మందికి తగ్గకూడదు. తెలంగాణ, కేసీఆర్ సత్తాను ఖమ్మం సభ దేశానికి చాటాలి.”  –హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news