తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్ర బాబు – హరీష్ రావు

-

నిన్న చంద్రబాబు ఖమ్మం పర్యటనపై మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు పాలన బాగాలేదని ఏపీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని చురకలు అంటించారు. బాబు హయంలోనే తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.. తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి అని ఆగ్రహించారు మంత్రి హరీష్‌ రావు.

తెలంగాణ అన్న యువతపై నక్సల్ ముద్ర వేశారు.. చంద్ర బాబువి మాయ మాటలని నిప్పులు చెరిగారు మంత్రి హరీష్‌ రావు. చంద్రబాబుకు బీజేపీతో ఆంధ్రలో పొత్తు పెట్టుకోవాలని కోరిక అన్నారు. అందుకే ఖమ్మలో సభ పెట్టి హడావిడి చేస్తున్నారు.. బీజేపీతో పొత్తు కోసమే ఆయన డ్రామాలు అని ఆగ్రహించారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా?.. ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు.. ఇప్పుడు ఉన్న టీడీపీ ఎన్టీఆర్‌ పెట్టిన టీడీపీ కాదని విమర్శలు చేశారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news