జగన్ ఆ రూట్ లో వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా !

-

ఏపీలో రోడ్ల గురించి మాజీ ఎంపీ ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను పుట్టిన తర్వాత ఇంత అసహ్యంగా రోడ్లు ఎప్పుడూ లేవని రాజమండ్రి మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నానన్న ఆయన గోదావరి నాలుగో వంతెన పై కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణిస్తే జగన్ ఏమి చెప్పినా నేను చేస్తానని అన్నారు.

ఒక వేళ ఆయన నన్ను రాజకీయాలు నుంచి తప్పుకోమంటే తప్పుకుంటానని హర్ష కుమార్ చెప్పుకొచ్చారు. జాతీయ రహదారులు మరమ్మతులు చేసిన తర్వాతే టోల్ వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు రోడ్లు మరమ్మతులు చేయకుండా వాహనాలు పై జరిమానా విధించటం ముఖ్యమంత్రికి సబబు కాదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news