Tokyo Paralympics : భార‌త్‌ ఖాతాలో మ‌రో ప‌త‌కం

-

టోక్యో పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. తాజా భార‌త్‌ కు మ‌రో ప‌త‌కం వచ్చింది. ఆర్చరీలో కాంస్య ప‌త‌కం సాధించాడు హ‌ర్వీంద‌ర్ సింగ్‌. టోక్యో పారాలింపిక్స్ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్‌లో భారత్‌ కు చెందిన హర్విందర్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో పారాలింపిక్స్‌లో భార‌త్‌ పతకాల సంఖ్య 13 చేరుకుంది.

కాగా… ఇవాళ ఉదయం పురుషుల హైజంప్ లో భారత్ కు సిల్వర్ పతకం దక్కింది. పురుషుల హైజంప్ లో భారత క్రీడా కారుడు ప్రవీ ణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంపు చేసి ఈ రజత పతకాన్ని సాధించాడు. ఇవాళ మధ్యాహ్నం మహిళ షూ టర్‌ అవని లేఖారా ఎయిర్‌ రైఫిల్‌ విభాగం లో కాంస్య పతకా న్ని గెలిచింది. మహిళల 50 మీ రైఫిల్ విభాగం లో అవని లేఖరా కాంస్య పతకం సాధించింది. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో ఇవాళ భారత్‌ కు మూడు పతకాలు వచ్చినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news