MI VS DC : 20 వేల మంది పిల్లలకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్న ముంబై

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా రేపు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 20 వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక ప్రత్యేకత ఉంది. ముంబై ఇండియన్స్ ఈ హై వోల్టేజ్ క్లాష్ ను పిల్లలకు అంకితం చేయాలనుకుంటున్నారు. ఆ రోజు అందరికీ విద్య మరియు క్రీడలు దినోత్సవంగా జరుపుకుంటామని ముంబై తెలిపింది.

ఇందులో భాగంగా ముంబై నగరంలోని NGOల నుండి 20,000 మంది పిల్లలను స్టేడియంలో ఫ్రీగా మ్యాచ్ ను చూసేందుకు అనుమతిస్తున్నారు. 2010 నుండి రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబై ఇండియన్స్ వెనుకబడిన పిల్లలకు క్రీడలు, విద్యకు సపోర్ట్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తుంది. కాగా, రేపు సాయంత్రం ముంబైలోని వాంకేడే స్టేడియం వేదికగా 3: 30 pm కి ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్లు కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ మాత్రం ఆడిన అన్ని మ్యాచ్లు ఓటమి చవిచూసింది. ఇక రేపు జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news