కేసీఆర్ అన్న మాటలకు ఏ కేసు పెట్టాలి: మంత్రి కొండా సురేఖ

-

మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీ పై మండిపడ్డారు. తుక్కుగూడ సభ నుంచి బీఆర్ఎస్‌ను తరిమి కొట్టాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ జనజాతర సభలో ఆమె హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ నోటీసుల పంపిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.హీరోయిన్లను బ్లాక్‌మెయిల్ చేసినవ్ అని అన్నందుకే తనకు నోటీసులు పంపించావే.. కరీంనగర్ ప్రెస్ మీట్ కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఏ కేసు పెట్టాలని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించింది. ఆ సమయంలో కేటీఆర్ కూడా వేదికపైనే ఉన్నాడని ,కుక్కల కొడుకుల్లారా అని ఎవరిని అన్నారని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు.తెలంగాణ మహిళలను కేసీఆర్ అలా తిట్టారని.. అలాంటి కేసీఆర్ పై ఏ కేసు పెట్టాలని ,కుక్కల కొడుకులు అని మాట్లాదినందుకు కేసీఆర్‌ను బహిరంగంగా ఉరితీసిన క్షమాపణ లేదని కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న ఫ్రస్టేషన్ లో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news