కరోనాతో హైదరాబాద్ ని వణికిస్తున్న ఆ ఒక్కడు ఇతడే..!

-

కరోనా హైదరాబాద్ వచ్చింది అనగానే చాలా మంది భయపడ్డారు. అవును ఇప్పుడు హైదరాబాద్ మొత్తం, తెలుగు రాష్ట్రాలు మొత్తం దీని గురించే చర్చలు జరుపుతున్నాయి. కరోనా గురించి తెలంగాణా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తు౦ది. ఇక హైదరాబాద్ లో కరోనాకు ప్రత్యేక ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. ఎక్కడా కూడా వ్యాధి విస్తరించకుండా ఉండేందుకు గాను అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణాలో కరోనా సోకిన వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను కాలు మీద కాలేసుకుని కూర్చుని చికిత్స పొందుతున్నాడు. అతని వార్డ్ లో ఎవరికి కూడా అనుమతి లేకుండా వైద్యులు, అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక దీనిపై పలువురు ఆసక్తికర కామెంట్ లు చేస్తున్నారు. అతను హైదరాబాద్ ని వణికిస్తున్న ఒకే ఒక్కడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మమ్మల్ని భయపెడుతూ ఎంత దర్జాగా ఉన్నావయ్యా అని మరోకొందరు అంటే త్వరగా కోలుకోండి మాస్టారూ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణా ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రత్యేక నిధులను కూడా కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news