ఆరోగ్యాన్ని మురిపించే పైనాపిల్‌..!

-

వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో ‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. అలాగే పైనాపిల్ తీసుకోవడం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చు.  క్యాన్సర్‌ రోగుల్లో రేడియేషన్‌ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ సమర్థంగా నివారించగలదు.


అలాగే పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నుంచి రక్షిస్తుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. పైనాపిల్ తీసుకోవడం ద్వారా ఆస్తమాను కూడా దూరం చేసుకోవచ్చు. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు నుండి ర‌క్షిస్తుంది. దంతాలూ చిగుళ్లూ వంటివి బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న పైనాపిల్‌ పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి.

అదే విధంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన పైనాపిల్ పండు రసం ఇస్తే చాలా మంచిది. పైనాపిల్‌ పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు ఉంచి తింటే అజీర్తి పోతుంది. పైనాపిల్ పండు రసాన్ని ముఖాని కి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది. మ‌రో విశేషం ఏంటంటే పచ్చి పైనాపిల్‌ రసం తెగిన గాయాలపై వేస్తే రక్త స్రావం అరికడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news