కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్‌కి కరోనా పాజిటివ్..!

-

కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్‌కి శుక్రవారం కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ”నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ లో ఉన్నాను. నాతో కలిసి పని చేసిన అధికారులు, సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోవాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి” అని అగర్వాల్ ట్వీట్ చేశారు.

కాగా, కరోనాతో విధించిన లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితి, కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఆయన తరచూ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 24,83,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే దీని బారిన పడి ఇప్పటి వరకు 48,367 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news