హైదరాబాద్‌ రోడ్లపై 2 వేల నోట్ల కుప్పలు.. ఫోటోలు వైరల్‌

-

హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ రోడ్లపై నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. మాదాపూర్‌ పరిధిలో రూ. 2 వేల నకిలీ కరెన్సీ నోట్లు కనిపించాయి. నడిరోడ్డుపై గుట్టలుగా పోసిన కరెన్సీ నోట్లను చూసి అటుగా వెళ్లే జనం ఎగబడి చూశారు. 100 ఫీట్‌ రోడ్‌ సమీపంలోని కాకతీయ రోడ్డులో రూ.2వేల కరెన్సీ నోట్లు గుట్టలుగా పోసి ఉంచారు. నోట్లను చూసిన వెంటనే స్థానికులు వాహనదారులు కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు.

దొరికిన కరెన్సీ చాలా మంది తీసుకున్నారు. రూ. 2వేల చిల్ట్రన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అని ఉండటంతో నోట్లు తీసుకెళ్లిన వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. ఇక ఈ సమాచారం అందుకున్న మాదాపూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. ఆ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లతో సంబంధం కలిగిన ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర లభ్యమైన సంచుల్లో రూ.2 వేలు, రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఈ సంఘటన హైదరాబాద్‌ వ్యాప్తంగా కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news