రానున్న 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు..!

-

రానున్న 4 రోజుల పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కూరుస్తాయని. అలాగే ఉత్తర కోస్తాలో మూడు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వివరించారు. అలాగే, ఆగ్నేయ బంగాళాఖాతంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు రానున్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news