తిరుమల భక్తులకు అలెర్ట్.. శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం

-

కొండంత జనం ఏడుకొండలకు తరలివస్తున్నారు. తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి తరలివస్తున్న జనంతో ఏడుకొండలు సందడిగా మారాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసినా.. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గకపోగా రోజురోజుకు పెరిగిపోతోంది. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి మాసం ముడో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. వేంకటేశ్వరుని దర్శనానికి దాదాపు రెండ్రోజుల సమయం పడుతోంది.

తితిదే సర్వ దర్శన క్యూలైన్లలో కొన్ని మార్పులు చేసింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు గుండా నారాయణగిరి షెడ్లలోకి భక్తులు ప్రవేశించేలా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. గతంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్​లు, నారాయణగిరి షెడ్లల్లో భక్తులు నిండితే ఏటిసి, ఎస్.ఎం.సి, లేపాక్షి, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్, ఇల వెంకమాంబ అన్న సత్రాల వరకు క్యూ లైన్ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం తితిదే చేయించేది.

ఇప్పుడు సర్వ దర్శన భక్తులను ఔటర్ రింగ్ రోడ్డు కొత్తగా క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులను వైకుంఠ కాంప్లెక్స్​లోకి అనుమతిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లలో సైతం భక్తులు నిండిపోయారు. పెరటాసి మాసంలో రద్దీ అధికంగా ఉంటుందని ముందుగానే భావించినా.. టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్తులు పోటెత్తుతున్నారు.

భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news